ఉప్పల్, సెప్టెంబర్ 13: కాలనీ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్లోని లక్ష్మీనారాయణకాలనీలో సోమవారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, కార్పొరేటర్ రజితాపరమేశ్వర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి, సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార చర్యలపై చర్చించారు. డ్రైనేజీ అవుట్లెట్ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, ఎస్ఈ అశోక్రెడ్డి, ఈఈ నాగేందర్, డీఈ నిఖిల్రెడ్డి, ఏఈ వసంత, నేతలు వెంకటేశ్వర్రెడ్డి, భాస్కర్ ముదిరాజ్, రవికుమార్, సంతోష్రెడ్డి, సుధాకర్, కాలనీ అధ్యక్షుడు లూకాస్, సురేందర్రెడ్డి, రాములు, రవీందర్,నర్సింహ, ప్రతిభ,అశోక్,నాగేశ్వర్రావు, జాకీర్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.