ఉప్పల్, జూలై 11 : పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తెలిపారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ డివిజన్కు చెందిన శ్రీనివాస్కు రూ.60 వేల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును ఆదివారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అన్నివర్గాల ప్రజలకు లబ్ధిచేకూరేలా ప్రభుత్వ పథకాలు సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, నేతలు గరిక సుధాకర్, చింతల నర్సింహారెడ్డి, నయా వెంకట్రావు, నందికంటి శివ, ఐలేశ్ పాల్గొన్నారు.
ఉప్పల్, జూలై 11 : బోనాలను పురస్కరించుకొని పండుగకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ గ్రేటర్ టీఆర్ఎస్ నాయకుడు సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కలిశారు. ఈ మేరకు నాచారం డివిజన్కు చెందిన దేవాలయాల జాబితాను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి, ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్ర శ్రీనివాస్రెడ్డి, కట్ట బుచ్చన్న, విఠల్, గరిక సుధాకర్, నందికంటి శివ, తదితరులు పాల్గొన్నారు.