హైదరాబాద్ : నిరుపేదల కుటుంబానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అండగా నిలిచారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ మహిళకి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.3 లక్షల ఎల్వోసీని అందజేశారు. బోర్డు పరిధిలోని ఎనిమిదో వార్డు బొల్లారంకు చెందిన లలితాబాయి గుండెజబ్బుతో నగరంలోని ఓ ఆదవాఖానలో చికిత్స పొందుతున్నది. లలితాబాయి వైద్య ఖర్చులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నందున ఈ విషయాన్ని బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథం దృష్టికి తేవడంతో ఆయన ఎమ్మెల్యే సాయన్నకు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ రూ.3 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించి చెక్కును గురువారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, పిట్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు.
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలి