మియాపూర్, జూలై 1 : పరిసరాల పరిశుభ్రతకై పది రోజుల పాటు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ సర్కిల్ కార్యాలయం వద్ద గురువారం డీసీ నందగిరి సుధాంశ్, సర్కిల్ వైద్యాధికారి డాక్టర్ కార్తీక్ సహా కార్పొరేటర్లు మంజుల రఘునాథ్రెడ్డి, పూజిత గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్తో కలసి ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. గ్రామాలు పట్టణాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతి, డీఈ రూపాదేవి, డీఈ సురేశ్, ఏఈలు అనురాగ్, రమేశ్, ప్రశాంత్, వర్క్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్, జగదీశ్, ఎస్ఎస్ శ్రీనివాస్, పార్టీ డివిజన్ల అధ్యక్షులు రఘునాథ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, గౌతం గౌడ్, పార్టీ నేతలు పురషోత్తం యాదవ్, వాలా హరీశ్, దాసరి గోపి, వెంకటేశ్, శ్రీను, రాంచందర్, జనార్దన్రెడ్డి, రవీందర్రెడ్డి, అక్బర్ ఖాన్, గురుచరణ్ దూబే, వెంకటేశ్, శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్లోని ఈనాడు కాలనీలో డీసీ ప్రశాంతి, వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, కార్పొరేటర్ రోజాదేవిలతో కలసి విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో మొక్కలు నాటారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ.. పరిశుభ్రత పచ్చదనం పెంపు లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పది రోజుల పాటు విజయవంతంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీరాములు, ఎంటమాలజీ ఏఈ ఉషారాణి, ఎస్ఎస్ నరేశ్, నాయక్, పార్టీ నేతలు రంగారావు, సంజీవరెడ్డి, పెద్ద భాస్కర్రావు, నాయినేని చంద్రకాంత్రావు, శ్రీనివాసరెడ్డి, చంద్రమోహన్, భుజంగరావు, అశోక్రెడ్డి, రవీందర్, మోజెస్, రాము, చంద్రశేఖర్, రమణారెడ్డి, మురళీ పాల్గొన్నారు.