మియాపూర్ , జూన్ 29 : దళిత సమాజ అభివృద్ధి కోసం అర్హులైన వారికి ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని దళిత సాధికారత నిధి నుంచి అందించ నున్నట్లు ప్రకటించటం ద్వారా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని గొప్ప నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నారని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. రూ. 1200 కోట్లతో దళిత సాధికారత నిధిని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ శేరిలింగంపల్లి ఎస్సీ సెల్ అధ్యక్షుడు మోజెస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు రోజాదేవి, నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్లతో కలసి సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ దళిత సమాజం అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దళితుల జీవితాల్లో ఈ పథకం గుణాత్మకమైన మార్పును తీసుకు రానున్నద న్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు రంగారావు, శ్రీనివాస్ యాదవ్, నాయి నేని చంద్రకాంత్రావు, కాశీనాథ్,ఆంజనేయులు, అల్లం మహేశ్, అష్రాఫ్, విజయమ్మ, రాము, శ్రీనివాస్, గిరిబాబు,రాము, అర్జున్, సామేలు, సాయిగౌడ్, విక్రమ్, రాజు, రామాంజనేయులు, కూర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ రైతుబజార్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్గౌడ్, నార్నె శ్రీనివాస్రావులతో కలసి విప్ అరెకపూడి గాంధీ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, సత్యనా రాయణ, కాశీనాథ్, పోశెట్టి,కాజా తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, జూన్ 29 : శిల్పాగార్డెన్స్ కాలనీ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానని శేరిలింగంపల్లి ఎమ్మె ల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం శిల్పాగార్డెన్స్ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ, మంజీరా, రహదారుల నిర్మాణం, వీధి దీపాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు వాపోయారు. ఆయన వెంట శేరిలింగంపల్లి సర్కిల్ డీఈ శ్రీనివాస్, ఏఈ ప్రతాప్, జలమండలి మేనేజర్ సందీప్, మియాపూర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్, శిల్పాగార్డెన్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామరావు, ఉపాధ్యక్షుడు అభినవ్, ప్రధాన కార్యదర్శి రామకిశోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.