మియాపూర్, ఆగస్టు 4 : ప్రభుత్వ తోడ్పాటులో నియోజకవర్గవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన బోనాల ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. భక్తి శ్రద్ధల మధ్య ప్రజలు ఎంతో ఆనందంగా వేడుకలను నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. బోనాల ఉత్సవాలకు గాను ప్రభుత్వం నియోజవకర్గ వ్యాప్తంగా 73 ఆలయాలకు మంజూరు చేసిన రూ. 22.50 లక్షల చెక్కులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ఆలయ కమిటీ ప్రతినిధులకు బుధవారం వివేకానందనగర్లోని తన నివాసంలో విప్ అరెకపూడి గాంధీ అందించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. అన్ని మతాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యతనిస్తూ ఉత్సవాల నిర్వహణకు తోడ్పాటును అందిస్తున్నదన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీకలైన బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం నిధులను విడుదల చేయడం పట్ల నియోజవకర్గ ఆలయాల కమిటీలు, ప్రజల తరపున విప్ గాంధీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్రావు, మాజీ కార్పొరేటర్ రంగారావు, పార్టీ నేతలు గౌతం గౌడ్, నాయినేని చంద్రకాంత్రావు, శ్రీను, కార్తిక్రావు, శేఖర్, జంగం గౌడ్, కాశీనాథ్, అల్లం మహేశ్, నర్సింహ, నాయుడు, సుధాకర్, గణపతి, రమేశ్, గోపి పాల్గొన్నారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల హేమసాయి అపార్టుమెంట్ వాసులు పార్టీ నేతలు సత్యనారాయణ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారంతో పాటు చేపట్టవలసిన అభివృద్ధి పనులపై విప్ అరెకపూడి గాంధీని బుధవారం ఆయన నివాసంలో కలిసి విన్నవించారు. ఈ సందర్బంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించి సీసీ రహదారి నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, అపార్టుమెంట్ సంఘం ప్రతినిధులు హరీశ్ ధర్మరాజు, అరవిందరెడ్డి, వోలేటి శ్రీనివాస్, రజన్బాబు తదితరులు పాల్గొన్నారు.