మియాపూర్, ఆగస్టు 2: కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. భవిష్యత్లో వ్యవసాయ రంగం మరిన్ని కొత్త పుంతలు తొక్కి యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువడం ఖాయమన్నారు. సోమవారం అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతి పేట్ గ్రామంలో రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ రైతు నాగరత్నం నాయుడు సహకారంతో నాబార్డు చైర్మన్ డాక్టర్ గోవిందరాజులుతో కలిసి రైతు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు సమగ్ర సాగు విధానాలు పాటించాలన్నారు. ఒకే పంట విధానానికి స్వస్తి పలికి అంతర పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులు పండించిన పంటలను తామే మార్కెట్ చేసుకోగలిగితే మంచి లాభాలు రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విద్యాలయ వైస్ చాన్సలర్ ప్రవీణ్కుమార్, లక్ష్మారెడ్డి, వెంకట్రామిరెడ్డి, సీజీఎం కృష్ణారావు, నాగరత్నం నాయుడు, యెడవెల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.