మియాపూర్, జూలై 29 : రెండేండ్లుగా కరోనాతో లావాదేవీలన్ని నిలిచిపోయి ఆ ప్రభావం రాష్ట్ర ఖజానాపై తీవ్రంగా చూపినా.. ప్రజా సంక్షేమ పథకాలకు ఏమాత్రం లోటు రానివ్వకుండా ప్రభుత్వం సమర్థతతో సమన్వయంతో పని చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా 200 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా మంజూరైన రూ. 2,00,23,200 ఆర్థిక సాయం చెక్కులను కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధర్రెడ్డి, పూజిత గౌడ్, సింధురెడ్డి, మంజుల రఘునాథ్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి విప్ గాంధీ గురువారం మియాపూర్లోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాతో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నా ఎక్కడా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పూర్తి భరోసాగా నిలిచిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసీల్దార్ శంకర్, ఆర్ఐ చంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, రవీందర్, వీరేశం, పార్టీ నేతలు రఘునాథ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, లక్ష్మారెడ్డి, శ్రీను, కొండల్రెడ్డి, మోహన్ముదిరాజ్, మల్లారెడ్డి, సాంబశివరావు, అక్బర్ఖాన్, చాంద్పాషా, సుధాకర్, జనార్దన్రెడ్డి, గుడ్ల ధనలక్ష్మి పాల్గొన్నారు.