మియాపూర్, జూలై 23 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ని ఆయా డివిజన్లకు చెందిన 125 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద మంజూరైన రూ.1,25, 14,500ల చెక్కులను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి విప్ శుక్రవారం వివేకానందనగర్లోని ఆయన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కష్టసుఖాల్లో అండగా తమ ప్రభుత్వ పథకాలు భరోసాగా నిలుస్తున్నాయన్నారు. ఆర్థిక స్థోమత లేని నిరుపేద యువతులకు పెద్దన్నలా సీఎం కేసీఆర్ ఉంటూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆదుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ అందించేందుకు తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు.
బక్రీద్ పండుగను పురస్కరించుకని ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండకు చెందిన మైనార్టీ నేతలు కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా విప్ వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో యాదగిరి, పార్టీ నేతలు సంజీవరెడ్డి, శ్రీనివాస్యాదవ్, గణేశ్, లక్ష్మీనారాయణ, పెద్ద భాస్కర్రావు, దామోదర్రెడ్డి, చంద్రకాంత్రావు, ప్రసాద్, కార్తీక్రావు, రాజేందర్, కాశీనాథ్, రాంచందర్, మున్నా, శ్రీనివాస్, ఖాజా, పోశెట్టి, వాసుదేవరావు, వాసు, యాదగిరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.