కొండాపూర్, జూలై 21 : నియోజకవర్గ వ్యాప్తంగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం ఆయన కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ ఎస్టేట్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని సమస్యలు, అభివృద్ధిపై కాలనీ వాసులతో చర్చించినట్లు తెలిపారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పార్కు ఎంతో అభివృద్ధి చెందిందని, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, గ్రీనరీతో ఆహ్లాదంగా మారిందన్నారు. కాలనీలో వర్షపునీటిని ఒడిసి పట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు బాగున్నాయన్నారు. ఇతర కాలనీ అసోసియేషన్లు సైతం వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్తో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ రమేశ్, ఏఈ ప్రతాప్, కాలనీ ప్రెసిడెంట్ విద్యా సాగర్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎస్వీఎన్ రాజు, సెక్రటరీ రేవతి, అమర్నాథ్, బెనర్జీ, రమాకాంత్, రాకేశ్, కాలనీవాసులు పాల్గొన్నారు.