కొండాపూర్, జూలై 18 : నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం కొండాపూర్ డివిజన్ శ్రీనివాస కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్లో సమస్యలు పునరావృతమవ్వకుండా అధికారులతో చర్చించి పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, నాయకులు ఊట్ల కృష్ణ, వార్డు మెంబర్ జంగంగౌడ్, నాయకులు బలరాం యాదవ్, తిరుపతి, సుబ్బయ్య యాదవ్, కాలనీ వాసులు వీవీ రావు, నర్సింగరావు, బాబురావు, సత్యం, కృష్ణ పాల్గొన్నారు.