మియాపూర్, జూలై 10 : ప్రతి ఆవాసం బాగుంటే తద్వారా వీధి బాగుంటుందని ఇలాంటి పరిశుభ్ర వాతావరణంతో నిత్యం ఆరోగ్యం మన చెంతనే ఉంటుందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఎవరికి వారు చిత్తశుద్ధితో కృషి చేస్తే ప్రతి వీధి ఆహ్లాదానికి నెలవుగా మారుతుందన్నారు. పరిసరాలను బాగుచేసుకునేందుకు ప్రభుత్వం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా పది రోజుల పాటు విజయవంతంగా కొనసాగిందని, పరిశుభ్ర వాతావరణాన్ని కొనసాగించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీనగర్లో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, డీసీ నందగిరి సుధాంశ్, అధికారులు, కాలనీ వాసులు, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయనగర్లో శనివారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటరు దొడ్ల వెంకటేశ్గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, అధికారులు, కాలనీ వాసులతో కలిసి ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దోమల నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ సర్కిల్ ఈఈ శ్రీకాంతి, డీఈ రూపాదేవి, కూకట్పల్లి డీఈ గోవర్ధన్, ఏఈ సుభాష్, ఉషారాణి, ధీరజ్, వైద్యాధికారులు డాక్టర్ కార్తీక్, డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, డీజీఎం నాగప్రియ, మేనేజర్ సాయిచరిత, జగదీశ్, మహదేవ్, బ్రహ్మం, ఆయా డివిజన్ల పార్టీ నేతలు జిల్లా గణేశ్, శ్రీనివాస్యాదవ్, దొడ్ల రామకృష్ణ గౌడ్, కాశీనాథ్, అనీల్రెడ్డి, శ్రీకాంత్యాదవ్, యాదగిరి, శ్రీనివాస్, రాజేశ్, మోహన్ ముదిరాజ్, గంగాధర్, అన్వర్ షరీఫ్, శ్రీనివాస్, మహేందర్, కాలనీ అధ్యక్షుడు అన్నిరాజు, రామాంజనేయరెడ్డి, రాఘవరావు, అశోక్, శ్రీనివాస్, సుశీల్, వెంకటరెడ్డి, వెంకటేశ్, మధుసూదన్రెడ్డి, మోహన్రెడ్డి, కృష్ణారావు, అగ్రవాసు, సంగేమేశ్, యాదగిరి, ఖైసర్ తదితరులు పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువులో దోమల లార్వా నివారణకు గంబూషియా చేపలను కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, ఎంటమాలజీ అధికారులు, సిబ్బందితో కలిసి ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ వదిలారు. ఈ కార్యక్రమంలో డీఈ గోవర్ధన్, ఏఈ సుభాష్, ఏఈ ఉషారాణి, వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, సత్యనారాయణ, మహదేవ్, బ్రహ్మం, పార్టీ నేతలు గణేశ్, శ్రీనివాస్యాదవ్, దొడ్ల రామకృష్ణ గౌడ్, కాశీనాథ్, శ్రీకాంత్యాదవ్, శ్రీనివాస్, రాజేశ్, అనీల్రెడ్డి, యాదగిరి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.