మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం దృశ్యం 2. కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అతి పెద్ద విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలను సైతం గెలుచుకున్న ఈ మూవీని పలు భాషలలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో రీమేక్ కాగా, 45 రోజులలో చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలు పోషించారు.
ఇక ఇప్పుడు హిందీలోను రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన తారాగణం, సాంకేతిక వర్గ వివరాలన్నీ తెలియనున్నాయి. కాగా, ‘దృశ్యం’ హిందీ రీమేక్లో అజయ్ దేవగణ్, శ్రియ నటించగా సీక్వెల్లో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.