శేరిలింగంపల్లి, జూన్ 15 : వర్షాకాలాన్ని దృష్టిలో పె ట్టుకుని నాలా విస్తరణ పనుల్లో వేగాన్ని పెంచాలంటూ ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దర్గా వెస్టర్న్ ప్లాజా సమీపంలో కొనసాగుతున్న నాలా విస్తరణ పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భం గా విప్ గాంధీ మాట్లాడుతూ.. వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా చేపట్టిన నాలా విస్తరణ పనులను యుద్ధ ప్రాదిపదికన పూర్తి చేయాల్సిందిగా తెలిపారు. పనుల్లో పూర్తి స్థాయి నా ణ్యత ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ సుదర్శన్, డీఈ శ్రీనివాస్, ఏఈ కృష్ణవేణి, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, నాయకులు రమేశ్, గోవింద్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రశాంత్హిల్స్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ తెలిపారు. మంగళవారం అధికారులతో కలిసి ఆయన ప్రశాంత్హిల్స్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని విప్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, జీహెచ్ఎంసీ అధికారులు ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ సుదర్శన్, డీఈ శ్రీనివాస్, ఏఈ కృష్ణవేణి, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
మియాపూర్, జూన్ 15 : ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఆయా డివిజన్లకు చెందిన బాధిత ప్రజలకు సీఎం సహాయనిధి పథకం కింద దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 4 లక్షల నిధులకు సంబంధించిన మంజూరు పత్రాలను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి లబ్ధిదారులకు విప్ గాంధీ అందించారు. కార్యక్రమంలో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణీనగర్లో నాలా పూడికతీత పనులతో పాటు, దత్తాత్రేయ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్తో కలిసి విప్ అరెకపూడి గాంధీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడు వర్షాకాలంలో నెలకొంటున్న ముంపు సమస్యకు నాలా విస్తరణ పనులు శాశ్వత పరిష్కారాన్ని చూపుతాయన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నాలాను విస్తరించటంతో పాటు నాలాల్లో పేరుకున్న వ్యర్థాలను ఎప్పటికపుడు తొలగించే పనులను ముందస్తుగా చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈ గోవర్ధన్, డీఈ శ్రీనివాస్, పార్టీ నేతలు సమ్మారెడ్డి, వాసుదేవరావు, జగదీశ్, సత్యనారాయణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.
హఫీజ్పేట్, జూన్15 : వర్షాకాలంలో లోతట్టుప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్య లు తీసుకుంటున్నామని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మియాపూర్ జాతీయ రహదారిపై కల్వర్టువద్ద నాలా పూడికతీత పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా సృష్టించిన ఉత్పాతంలో ఎన్నో రంగాలు కుదేలైనప్పటికీ అభివృద్ధి, సంక్షేమాలను మాత్రం రాష్ట్రప్రభుత్వం ఎన్నడూ విస్మరించేలేదన్నారు. గత అనుభవాల దృష్ట్యా రానున్న వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కటుగకుండా ఇప్పటి నుంచే కార్యచరణ అమలుచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ శ్రీకాంతిని, కాలనీవాసులు పాల్గొన్నారు.