మియాపూర్, జూన్ 10 : ప్రజారోగ్యం ప్రజా రక్షణే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. అన్ని వేళలా ప్రజలకు అండగా నిలుస్తూ కొండంత భరోసాను కల్పిస్తూ సీఎం కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి రూ. 1.90 లక్షల చెక్కులను ప్రభుత్వ విప్ గాంధీ గురువారం వివేకానందనగర్లోని తన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులు సవాళ్లు విసురుతున్నా పటిష్టంగా వాటిని ఎదుర్కొంటూ ప్రభుత్వం ప్రజలకు భరోసాను కల్పిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేశ్ముదిరాజ్, పార్టీ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్యాదవ్, సైదేశ్వర్, కార్తిక్రావు తదితరులు పాల్గొన్నారు.
హైదర్నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్నగర్, ఏఎస్రాజునగర్లో నెలకొన్న డ్రైనేజీ ఔట్లెట్ సమస్యలను నిజాంపేట మున్సిపల్ కమిషనర్ గోపి, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని త్వరలోనే చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ గోవర్దన్, ఏఈ రాజీవ్, మహదేవ్, మాజీ కార్పొరేటర్ రంగారావు, గణేశ్ముదిరాజ్, గోపాల్రెడ్డి, నాయినేని చంద్రకాంత్రావు, సైదేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ 61వ పుట్టిన రోజును పురస్కరించుకుని మన నందమూరి డాట్కామ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదర్నగర్ డివిజన్లోని భ్రమరాంబ థియేటర్లో నిర్వహించిన 500 మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, కేపీహెచ్బీ సీఐ లక్ష్మీనారాయణలతో కలిసి విప్ అరెకపూడి గాంధీ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గణేశ్, మాధవరం రంగారావు, నాయినేని చంద్రకాంత్రావు, బాలకృష్ణ అభిమాన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.