మియాపూర్, జూన్ 9 : వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు నాలా విస్తరణ పనుల ద్వారా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అధికారులు సైతం ఈ పనులను అత్యంత ప్రాధాన్యతగా భావించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. శేరిలింగంపల్లి నియోజవకర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో అంబీర్ చెరువు నుంచి ఎల్లమ్మ చెరువు వరకూ రాంకీ పెరల్ వద్ద రూ. 6 కోట్లతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను ప్రాజెక్టు అధికారులతో కలిసి విప్ గాంధీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. గత అనుభవాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి తగిన మరమ్మతులను ప్రారంభించామని అధికారులు వాటిని సకాలంలో పూర్తి చేయించి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని పనులలో ఏమాత్రం జాప్యం జరగకుండా పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలను పక్కాగా పాటించాలని విప్ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ రాంచందర్, పార్టీ నేత శ్రీనివాస్యాదవ్, రాంకీ వాసులు రాజశేఖర్, మధు, సత్తయ్య, శైలేందర్, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
హఫీజ్పేట్ జలమండలి అధికారులు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ బుధవారం తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్లు, ఇందుకోసం పైపులైన్ లేని ప్రాంతాలను గుర్తించి నెట్వర్క్ను విస్తరించాలని సూచించారు. ఎప్పటికపుడు పైపులైన్లపై పర్యవేక్షణ చేపడుతూ లీకేజీలు లేకుండా చూడాలని, గుర్తించిన ప్రాంతంలో తక్షణ మరమ్మతుల ద్వారా నీరు కలుషితం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది, అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందించాలని విప్ గాంధీ పేర్కొన్నారు. డీజీఎం నాగప్రియ, మేనేజర్లు పూర్ణేశ్వరి, సాయిచరిత, సునీత తదితరులు పాల్గొన్నారు.