బంజారాహిల్స్, జూలై 7 : అనుమానాస్పదంగా ఫుట్పాత్పై కూర్చుని ఏడుస్తున్న చిన్నారిని జూబ్లీహిల్స్ పోలీసులు చేరదీసి తల్లిదండ్రుల కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం రాత్రి యూసుఫ్గూడ చెక్పోస్ట్ వద్ద ఆరేండ్ల బాలిక ఏడుస్తూ పెట్రోలింగ్ పోలీసులకు కనిపించింది. తన పేరు సౌమ్య అని, ఉప్పుగూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నానని బాలిక చెప్పింది. తల్లిదండ్రుల పేర్లు ప్రవీణ్చారి, ఉమాలక్ష్మి అని చెప్పింది. కాని ఎందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిందో చెప్పలేదు. దాంతో ఆమెను పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి తల్లిదండ్రుల ఆచూకీకోసం గాలిస్తున్నారు.