ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ యువతిని ఆరేండ్ల తర్వాత తల్లి చెంతకు చేర్చారు ఆసిఫ్నగర్ పోలీసులు. లంగర్హౌస్లో నివసించే రేణుక అలియాస్ రాధిక (26) ఆరేండ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎన్ని చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి చెన్నమ్మ వదిలేసింది. ఎంతైనా తల్లి మనసు కదా.. తిరిగి నెల రోజులుగా వెతకడం ప్రారంభించింది. తన కూతురు తప్పిపోయే ముందు మెహిదీపట్నంలోని ఓ బట్టల దుకాణంలో పని చేసేదని తెలుసుకొని మార్చి 24న ఆసిఫ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇన్స్పెక్టర్ నాగం రవీందర్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం సాయంతో రాధిక మాదాపూర్లో ఉందని గుర్తించారు. మంగళవారం మాదాపూర్ వెళ్లిన ఆసిఫ్నగర్ పోలీసులు ఆమెను స్టేషన్కు తీసుకువచ్చి తల్లి చెన్నమ్మకు అప్పగించారు. ఈ కేసును ఛేదించిన ఆసిఫ్నగర్ పోలీసులను ఏసీపీ ఆర్జీ. శివమారుతి అభినందించారు.