హైదరాబాద్ : ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనం మాయమయిన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. డీఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట డివిజన్లోని వెంకటేశ్వరనగర్ ప్రాంతానికి చెందిన వెంకటరమణ కుమార్తె ఇ.ధనరేఖ(27) వృత్తిరీ త్యా హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఉద్యోగం చేస్తుంది. ఈ నెల 2న తన ఇంటి ముందు (టీఎస్ 11 ఈయూ 0147) టీఈఎస్ ద్విచక్రవాహనాన్ని పార్క్ చేసింది. మరుసటి రోజు చూసేసరికి ద్విచక్రవాహనం కనబడలేదు. చుట్టు పక్కల, ఇతర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం రాత్రి ధనరేఖ కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?