సిద్దిపేట /వర్గల్: జిల్లాలోని నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయాన్ని ఇప్పుడున్న పాత కట్టడాలను మార్చి స్తపతి సూచనలకు అనుగునంగా సమూల మార్పులకు శ్రీకారం చుడతాం. యాదాద్రి తరహాలో నాచగిరి గుట్టను అభివృద్ధి చేస్తామని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఎప్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డితో కలిసి శుక్రవారం నాచగిరి క్షేత్రాన్ని ఆయన దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.
తెలంగాణలోనే రెండో యాదాద్రిగా పిలువబడుతున్న నాచగిరి నృసింహస్వామి క్షేత్రం మహిమగల దేవాలయంగా పేరుగాంచిందన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలో భాగంగా ఇప్పటికే హరిద్రానది ప్రక్షాళనకు రూ.7.48 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. హల్దీవాగు సుందరీకరణ తరువాత ఆలయ పునర్నిర్మాణం వేగవంతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరికలు
రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి
బీచ్లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
త్వరలో టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి
మాస్క్ ధరించాలని పోలీసుల ప్రచారం