బేగంపేట్ అక్టోబర్ 22: సమస్యల పరిష్కారానికి ఎన్ని నిధులైన ఖర్చు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. రాంగోపాల్పేట్ డివిజన్లోని చెన్నై కాంపౌండ్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు గురువారం మంత్రిని కలిసి విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి తలసాని శుక్రవారం ఉదయం వివిధ శాఖల అధికారులతో కలిసి చెన్నై కాంపౌండ్లో పర్యటించారు. తమ కాలనీ నుంచి ము రుగు నీరు వెళ్లే నాలాను ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టడంతో వర్షం కురిసినప్పుడు మురుగు నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ప్రత్యక్షంగా పరిస్థితిని పరిశీలించిన మంత్రి తక్షణమే నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాన్ని తొలగించి నాలాను శుభ్రం చేయాలని ఆదేశించారు. డ్రైనేజీ, స్టాం వాటర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా డ్రైనేజీ అభివృద్ధికి స్టాం వాటర్ పైపులైన్ నిర్మాణానికి అవసరమైన రూ.42 లక్షలను వెంటనే విడుదల చేయనున్నట్లు, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డిలను ఆదేశించారు. బేగంపేట్ ఉప కమిషనర్ ముకుందరెడ్డి, తహసీల్దార్ బాలశంకర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.