కేపీహెచ్బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావును రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు పరామర్శించారు. ఇటీవల మందడి శ్రీనివాస్రావు తల్లి అచ్చాయమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్లోని మందడి శ్రీనివాస్రావు నివాసానికి విచ్చేసిన మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్, టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అచ్చాయమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మందడి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ప్రగా ఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గం కో-ఆర్డినేటర్ సతీశ్ అరోరా, కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్, మహ్మద్ గౌసుద్దీన్ ఉన్నారు.