సిటీబ్యూరో, సెప్టెంబరు 3 (నమస్తే తెలంగాణ ) : నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ డి. దామోదర్ రావును పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పరామర్శించారు. దామోదర్ రావు తండ్రి నారాయణ రావు గురువారం మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని బంజారాహిల్స్లోని వారి ఇంటికి వెళ్లి దామోదర్ రావును, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.