బన్సీలాల్పేట్ : బన్సీలాల్పేట డివిజన్ లోని పొట్టి శ్రీరాములు నగర్, గంగిడి ఎల్లారెడ్డి బస్తీలో నిర్మించిన ‘డబుల్ బెడ్ రూమ్’ ఇండ్ల కాలనీలను గురువారం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించనున్నారు. మంత్రితో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్. షర్మన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్, కార్పొరేటర్ కె.హేమలత, పలు ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ఆయా కాలనీల్లో పర్యటిస్తారని డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎల్.వెంకటేశన్ రాజు తెలిపారు.
డివిజన్ లో డబుల్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, వాటిని ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించారు. అయితే ఈ రెండు కాలనీలలో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం మంత్రి పర్యటిస్తారని ఆయన తెలిపారు.