హైదరాబాద్ : 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ముందుగా జాతీయ నేతల చిత్ర పటాల వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట లో, మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ గ్రౌండ్ లో గ్యాస్ మండి రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.
ఈ సందర్భంగా చిన్నారులకు స్వీట్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ, తలసాని స్కైలాబ్ యాదవ్, రాములు తదితరులు పాల్గొన్నారు.