బేగంపేట్, సెప్టెంబర్ 30: పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హామీ ఇచ్చారు. గురువారం ఆయన లాలా టెంపుల్ ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. లాలా టెంపుల్ ఆవరణలో నివసిస్తున్న ప్రజల ఇబ్బందులను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు చొరవ చూపాలని ఆదేశించినట్టు తెలిపారు. ఆ ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్టు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మాజీ కార్పొరేటర్ అరుణ, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, ఏసీపీ రమేశ్, టౌన్ప్లానింగ్ అధికారులతో పాటు కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
అమీర్పేట్, సెప్టెంబర్ 30: అత్యవసర సమయాల్లో నిరుపేదల వైద్యానికి సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపకరిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. అమీర్పేట్ డివిజన్కు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 3.17 లక్షల మొత్తం మంజూరైంది. గురువారం ఉదయం మంత్రి తలసాని మారేడ్పల్లిలోని తన నివాసంలో అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారితో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుపేదలకు సీఎం సహాయ నిధి కింద అత్యవసర సమయాల్లో ఎల్వోసీ ద్వారా ముందస్తు ఆర్థిక సాయం కూడా మంజూరవుతుందని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఇంతటి భరోసా గతంలో ఎన్నడూ చూడలేదని ప్రజలే చెబుతున్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారు గోవిందు మంత్రి తలసానికి, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి మణి సంతోష్కుమార్, డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు కూతురు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.