అమీర్పేట్, సెప్టెంబర్ 27 : సనత్నగర్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. సనత్నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ సంస్థాగత పర్వంలో భాగంగా అమీర్పేట్, బేగంపేట్, రాంగోపాల్పేట్, బన్సీలాల్పేట్, మోండా డివిజన్లకు నూతన అధ్యక్షుల నియామకం జరిగింది. అమీర్పేట్ డివిజన్ అధ్యక్షుడిగా హనుమంతరావు, ప్రధాన కార్యదర్శిగా మణి సంతోష్కుమార్, బేగంపేట్ డివిజన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్గౌడ్, ప్రధాన కార్యదర్శులుగా ఆరిఫ్, సందీప్, రాంగోపాల్పేట్ డివిజన్ అధ్యక్షుడిగా అత్తెల్లి శ్రీనివాస్గౌడ్, ప్రధాన కార్యదర్శులుగా ఆంజనేయులు, గణేశ్, మోండా మార్కెట్ డివిజన్ అధ్యక్షుడిగా ఆకుల హరికృష్ణ, బన్సీలాల్పేట్ డివిజన్ అధ్యక్షుడిగా వెంకటేశన్, ప్రధాన కార్యదర్శులుగా రాజేందర్, మహేందర్ నియమితులయ్యారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులు సోమవారం ఉదయం మంత్రి తలసానిని ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించారు.