అమీర్పేట్, జూన్ 1 : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలిస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సనత్నగర్లో కొనసాగుతున్న సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని గ్రేటర్ కమిషనర్ లోకేశ్కుమార్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణలతో కలిసి మంత్రి సందర్శించారు. ఇక్కడ వ్యాక్సిన్ అందుతున్న తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆలోచన చేసి లాక్డౌన్ నిర్ణయానికి వచ్చారని, దీని ఫలితంగా గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తీరు చూస్తున్నామని మంత్రి అన్నారు.
అమీర్పేట్లో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైన 50 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి వెంట సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.