సిటీబ్యూరో, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ)/బొల్లారం: సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతా న్ని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని రసూల్పుర కృష్ణ కాలనీలో కట్ట మైసమ్మ సిల్వర్ కాంపౌండ్ రూ. 17.36 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన జీ+3 అంతస్తులు గల 8 బ్లాకులలో నిర్మించిన 168 డబుల్ బెడ్రూం ఇళ్లను హోం మంత్రి మహమూద్ అలీ, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, శాసన సభ్యులు సాయన్నలతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న కారణంగానే అభివృద్ధికి దూరంగా ఉందని, ఇకడ పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏ మాత్రం నిధులు తెచ్చే అవకాశం లేదన్నారు. కంటోన్మెంట్ ఏరియా చుట్టు ప్రకల ప్రాంతం ఎంతో అబివృద్ధి చెందినట్లు, జీహెచ్ఎంసీలో విలీనమైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయన్నారు. కంటోన్మెంట్ ఏరియా పది వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని జీహెచ్ఎంసీలో విలీనమైతే పేదలకు మరిన్ని గృహాలు నిర్మించి ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
తద్వారా పేదలు గొప్పగా బ్రతికే అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. ఇంకా మిగిలిపోయిన లబ్ధిదారులకు 56 గృహాలను మంత్రి మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు 168 మంది లబ్దిదారులకు ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జీహెచ్ఎంసి హౌసింగ్ ఓఎస్డీ శంకరయ్య, ఆర్డీఓ వసంత, మారెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా ప్రాంతాలు వృద్ధి చెందా యి. కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. పేదలు ఆత్మాభిమానంతో గొప్పగా బతకాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం. అందుకే రెండు పడకల ఇండ్లు, కాలనీకి విద్యుత్తు, తాగునీరు, సీసీ రోడ్ల సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దేశంలో మరెకడా లేని విధంగా రెండు పడకల గదులను తెలంగాణ ప్రభుత్వం నిర్మి స్తూ నిరుపేదలకు అందిస్తుంది. సబ్బండ వర్గాల అభివృద్ధికి అనే క సంక్షేమ కార్యక్రమాలు ప్రభు త్వం అమలు చేస్తుంది. ప్రధానంగా రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్ లాంటి పథకాలు దేశంలో మరెకడా లేవు. ఇది తెలంగాణ ప్రభుత్వం ఘనత. – హోం మంత్రి మహమూద్ అలీ
గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా కంటోన్మెంట్ ప్రాంతానికి నిధులు మంజూరు కాక అభివృద్ధి జరగలేదు. రాష్ట్ర ప్రభు త్వం ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తుం ది. ధనవంతులు నివసించే గృహాల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం గృహాలను పేదలకు అందజేస్తుంది. – మంత్రి మల్లారెడ్డి
గతంలో ఈ కాలనీ ప్రజలకు ఆడ పిల్లలను ఇవ్వడానికి ఎవ్వ రూ ముందుకు రాలేదు. ముఖ్యమంత్రి కృషి మేరకు పేదలకు రెండు పడకల గృహాలను నిర్మిం చి అందజేయడం ఒక పండుగ. పేదల కోసం ఎకడా లేని విధంగా వినూత్న సంక్షే మ పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారు. – ఎమ్మెల్యే సాయన్న
గతంలో 30 గజాల స్థలంలో నే చిన్న గూడుండేది. అది ఇరుకుగా ఉండటంతో చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం అనుకున్నట్లుగానే డబుల్ బెడ్రూం కట్టియ్యడం ఆనందంగా ఉంది. దీంతో మా కల సాకారమైంది. ఇందుకు కృషి చేసిన సీఎం సారుకు ఎమ్మెల్యే సాయన్నకు ధన్యవాదాలు.- ముర్తూజ బేగం, సిల్వర్ కంపౌండ్ రసూల్పురా
ఇంతకు ముందు ఇరుకైన స్థలా లు, పూరి గుడిసెల్లో ఉండేవా ళ్లం. సీఎం కేసీఆర్ పుణ్యమా అని మేడలాంటి ఇండ్లు వచ్చా యి. చాలా ఆనందంగా ఉంది. ఎంతో సంతోషంగా గృహా ప్రవేశాలు చేసుకున్నం. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సాయన్నకు ఎంతగానో రుణపడి ఉంటాం. – పి.నర్సింగ్, సిల్వర్ కంపౌండ్, రసూల్పురా