అమీర్పేట్, మే 28 : కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కార్ సమర్ధవంతంగా పనిచేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సనత్నగర్ మల్టీపర్పస్ స్పోర్ట్ కాంప్లెక్స్లో శుక్రవారం ఏర్పాటుచేసిన సూపర్ స్ప్రెడర్స్కు ఇచ్చే వ్యాక్సినేషన్ కేంద్రాలను మేయర్ గద్వాల విజయలక్ష్మి, గ్రేటర్ కమిషనర్ లోకేశ్కుమార్తో కలిసి ప్రారంభించారు. నియోజకర్గంలో వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొవిడ్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశాలున్న అన్ని వ్యాపార వర్గాలకు చెందిన వారికి ఈ కేంద్రాల్లో 10 రోజుల పాటు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమాల్లో జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ముకుందరెడ్డి, వంశీ క్రిష్ణలతో పాటు కార్పొరేటర్లు కొలను లక్ష్మీరెడ్డి, కూర్మ హేమలత పాల్గొన్నారు.