బన్సీలాల్పేట, ఆగస్టు 4 : పద్మారావునగర్ హమాలీబస్తీలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రూ.16 కోట్లు మంజూరు అయ్యాయని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పలు బస్తీలవాసులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అపోహలు నమ్మొద్దని, అందరూ ఏకాభిప్రాయంతో రావాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాచానెహ్రూనగర్, బండ మైసమ్మనగర్ బస్తీల్లో డబుల్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావొచ్చాయని, దసరా నాటికి లబ్ధిదారులకు అప్పగిస్తామని చెప్పారు.