అమీర్పేట్, ఆగస్టు 3 : ప్రజా సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా పరిష్కరించే విషయంలో పార్టీ నాయకులు మరింత చురుగ్గా వ్యవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. మంగళవారం సనత్నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం మారేడ్పల్లిలోని మంత్రి నివాసంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఆయా డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ సనత్నగర్ నియోజకవర్గంలో ఇప్పటికే వందల కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశామన్నారు. కాలనీలు, బస్తీల్లోని సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కుర్మ హేమలత, మహేశ్వరి శ్రీహరి, అత్తెల్లి శ్రీనివాస్గౌడ్, కొలను బాల్రెడ్డి, సురేశ్గౌడ్, సమీఉల్లా తదితరులు పాల్గొన్నారు.