చిక్కడపల్లి, ఆగస్టు 2: సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సముచిత స్థానం కల్పిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. రాంగనర్ డివిజన్ బాగ్లింగంంపల్లి శ్రీరాంనగర్ బస్తీలో ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో బోనాలను బస్తీ అధ్యక్షుడు ఆర్ వివేక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రూ.15 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఎమ్మేల్యే ముఠా గోపాల్, నాయకుడు ముఠా జైసింహ, శ్రీరాంనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వివేక్, చైర్మన్ ఎన్. సత్యనారాయణ, వైస్ చైర్మన్ నరేందర్, సలహాదారు దానయ్య, ఎం. ఆనంద్, డి. కేశవరావు, ఉపాధ్యక్షుడు ఆర్. జయదేశ్, ఎ. శ్రీహరి, మహేశ్వర్, శివకుమార్, ఆనంద్, టీఆర్ఎస్ నాయకుడు ఆర్.మోజస్ తదితరులు పాల్గొన్నారు.