ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 29: రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తార్నాక మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు విజయ డెయిరీలో ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డెయిరీలో కొన్ని దశాబ్దాల నుంచి రాత్రీపగలు తేడా లేకుండా నగర ప్రజలకు పాలను సకాలంలో అందించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. కాని తాజాగా డెయిరీ యాజమాన్యం కొత్త వాహనాలను ఉపయోగించాలన్న నిబంధనలతో అనేక కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వెంటనే స్పందించి ప్రస్తుతం కొనసాగుతున్న వాహనాలకు ఫిట్నెస్ చేయించి కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ను డిప్యూటీ మేయర్ దంపతులు సన్మానించారు.