అబిడ్స్, జూలై 27 : బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పండుగలోపే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1న ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాల్లో మంగళవారం మంత్రి పర్యటించారు. ఉత్సవాల నిర్వహన నిమిత్తం 572ఆలయాలకు రూ.2.37 కోట్ల చెక్కులను ఆయా ఆలయ కమిటీల నిర్వాహకులకు అందజేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవిశ్రీప్రసాద్ హాజరై పూజలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బాలకృష్ణ, వెంకటేశ్, హరీశం, మల్లేశ్ పాల్గొన్నారు