సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు సామాజిక సేవలతో సాగాయి. శనివారం గ్రేటర్లో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చనలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతేకాక గిఫ్ట్ ఏ స్మైల్ కింద ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. రంగారెడ్డి, వికారాబాద్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి లక్ష నిఘంటువులు అందజేశారు. యూసుఫ్గూడలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేపట్టిన మెగా రక్తదాన శిబిరం లిమ్కాబుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇలా మంత్రి పుట్టినరోజు సామాజిక పండుగలా నిర్వహించారు.