అమీర్పేట్, జూలై 21 : బక్రీద్ పండుగను పురస్కరించుకుని బుధవారం సనత్నగర్ నియోజకవర్గం మైనార్టీ నాయకులు సయ్యద్ సిరాజుద్దీన్ ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను సిరాజుద్దీన్ గజమాలతో సత్కరించారు.
బన్సీలాల్పేట్, జూలై 21 : త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాల ని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవా రం మారెడ్పల్లిలోని తన నివాసంలో తనను కలిసిన బ న్సీలాల్పేట్ డివిజన్కు చెందిన టీఆర్ఎస్ మైనారిటీ విభా గం నాయకులు లక్ష్మీపతి, ఫహీమ్, అబ్బాస్, అక్బర్, అయూబ్, జావీద్లకు మంత్రి బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
బంజారాహిల్స్, జూలై 21 : బక్రీద్ సందర్భంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, సోమాజిగూడ డివిజన్ల పరిధిలోని మజీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫిలింనగర్లోని హకీంబాబా దర్గా వద్ద పెద్ద సంఖ్యలో ముస్లిం లు ప్రార్థనల్లో పాల్గొన్నారు.
హిమాయత్నగర్, జూలై 21 : బక్రీద్ను ముస్లింలు బుధవారం డివిజన్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రార్థనల అనంతరం పరస్పరం ఈద్ ముబారక్ తెలుపుకుని ఆలింగనం చేసుకున్నారు. కింగ్కోఠి, బగ్గీఖానలోని మజీద్ల వద్ద టీఆర్ఎస్ నాయకుడు రాజేందర్కుమార్ ముస్లింను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.