అమీర్పేట్, జూలై 19 : నిరుపేద కుటుంబాలకు ఆడబిడ్డల పెండ్లి భారం కావొద్దని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం ఉదయం తన నివాసంలో సనత్నగర్ డివిజన్కు చెందిన 20 మందికి కల్యాణ లక్ష్మి, ముగ్గురికి షాదీ ముబారక్ చెక్కులను బాలానగర్ తాసీల్దార్ ప్రవీణ్రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సనత్నగర్ డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.