బన్సీలాల్పేట్, జూన్ 18 : ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పారదర్శకంగా అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట్లోని జీవైఆర్ కాం పౌండ్ బస్తీలో లబ్ధిదారులతో శుక్రవారం మంత్రి మాట్లాడారు. జీవైఆర్ కాంపౌండ్ బస్తీలో 180 రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం పూర్తయ్యిందని, జూలై ఒకటిన ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ హౌజింగ్ ఈఈ ఎం.వెంకట్దాస్ రెడ్డి, డీఈఈ గంగాధర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
బన్సీలాల్పేట్, జూన్ 18 : ప్రజా సమస్యలను పరిష్కరించి, సనత్నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్పేట్ డివిజన్లో కార్పొరేటర్ కె.హేమలతతో కలిసి రూ. కోటి 50 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, బేగంపేట్ డీసీ ముకుందరెడ్డి, డీఈ ఆంజనేయులు, జలమండలి జీఎం రమణారెడ్డి, డీజీఎం వెంకట్రావు, విద్యుత్ ఏఈ రవీందర్, టీఆర్ఎస్ ఇన్చార్జి జీ.పవన్కుమార్ గౌడ్, నాయకులు లక్ష్మీపతి, ఏసూరి మహేశ్, రాజేందర్, మహే ందర్, లక్ష్మి, అమృత, నాగలక్ష్మి, దేశపాక శ్రీను, విజయ్శంకర్ పాల్గొన్నారు.
బన్సీలాల్పేట్, జూన్ 18 : పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తలను తన కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని, వారి కష్టసుఖాల్లో అండగా ఉంటానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ బన్సీలాల్పేట్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు ఇంట్లో జారి పడటంతో చేతి ఎముక విరగగా మంత్రి శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ హేమలత ఆయనను పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.