అమీర్పేట్, జూన్ 17 : అమీర్పేట్ డివిజన్ బాపునగర్ బస్తీలోని 400 గజాల ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకున్న చొరవ పట్ల బస్తీ వాసులు గురువారం ఆనందం వ్యక్తం చేశారు. ఈ స్థలానికి సంబంధించి 1960 ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినా, ప్రైవేట్ వ్యక్తులు కొందరు నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేసేందుకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని బస్తీవాసులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పరిశీలించిన మంత్రి.. ఈ స్థలం ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పడంతో బస్తీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. 21న జరిగే సర్వేతో వాస్తవాలు వెలుగు చూస్తాయని, మంత్రి తలసాని చొరవతోనే ఇది సాధ్యమైందని టీఆర్ఎస్ అమీర్పేట్ డివిజన్ అధ్యక్షుడు, బాపూనగర్ బస్తీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు రాకేశ్ జాదవ్ పేర్కొంటూ, బస్తీ ప్రజల తరఫున మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.