కామారెడ్డి : కొవిడ్ చికిత్స పొందుతున్న వారి దగ్గరికి ఎప్పటికప్పుడు వెళ్తూ వైద్య సిబ్బంది మనోధైర్యం కల్పించాలని డాక్టర్లు, నర్సులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ను మంత్రి తనిఖీ చేశారు. ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ..మీరు అందిస్తున్న చికిత్స కంటే మీరు కల్పించే భరోసాతోనే బాధితులు త్వరగా కోలుకుంటారని మంత్రి అన్నారు.
అలాగే కొవిడ్ వార్డులో విధుల్లో ఉన్నవారు ఐదుగురు పేషంట్స్ కి ఒకరు బాధ్యులుగా ఉండాలన్నారు. అలా ఐదుగురికి ఒకరు మానిటరింగ్ చేయడం వల్ల పేషంట్ పరిస్థితి కచ్చిత అంచనా మీకు తెలుస్తుందన్నారు. ప్రతి గంటకు ఒక్కసారి పేషంట్ కండిషన్ రికార్డ్ చేయాలని సూచించారు.
ప్రతి రోజు పేషంట్స్ హెల్త్ రిపోర్ట్ను జిల్లా కలెక్టర్ కు తెలియజేయాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి కలెక్టర్ డా.శరత్, ఎస్పీ శ్వేత, డీఎంహెచ్ఓ, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు