న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లకు పూర్తి సహాయ సహకారాలు అందించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా జరుగనున్న విశ్వక్రీడల కోసం భారత అథ్లెట్లు చెమటోడుస్తుండగా.. వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు కేంద్రం కసరత్తులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో శనివారం రిజిజు.. ఒలింపిక్స్లో పాల్గొంటున్న పలువురు ప్లేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు మాట్లాడుతూ.. ‘కేంద్రం నుంచి లభిస్తున్న సహకారం మరువలేనిది. ఎలాంటి అవసరమున్నా సాయ్, టాప్స్ టీమ్ మేమున్నామని ముందుకు వస్తున్నాయి’ అని పేర్కొంది.