హైదరాబాద్: విజయదశమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో ఆయుధ, వాహనపూజ కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తన క్వార్టర్లో ఈ పూజలు నిర్వహించారు.
తొలుత ఆయుధ పూజ చేసిన ఆమె, వాహన పూజ కూడా చేసిన తర్వాత ఒక జమ్మి మొక్కను నాటారు. ఆయుధపూజలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకులను కూడా ఉంచి పూజలు చేశారు.