కందుకూరు, ఆగస్టు 5 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సార్లరావుల పల్లి తండా సర్పంచ్ రజిత భర్త ప్రవీణ్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్లు గురువారం మంత్రి నివాసంలో కలిశారు. గ్రామ పంచాయతీ భవనంతో పాటు తమ తండా పరిధిలోని అనుబంధ తండాలకు నిధులు కేటాయించాలని ఆమెకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. సార్లరావులపల్లి, బండమీదితండా, గొట్టెలగడ్డతండా, పొచమ్మగడ్డ తండా, పొతుబండతండాలో సీసీ రోడ్డు, అండర్డ్రైనేజీ పనులకు 1.24 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. అట్టి పనులకు ఈ నెల 9వ తేదీన శంకుస్థాపన చేస్తానని, ఇంతకు ముందు గ్రామాభివృద్ధికి 65లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత కౌశిక్రెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సామ మహేందర్రెడ్డి, కళ్లెం సదానంద్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరం,ఆగస్టు5 : సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఉప్పుగడ్డతండాకు చెందిన మహేశ్కు ఎంపీ ల్యాండ్ క్రింద 5లక్షల 15వేల రూపాయల చెక్కు, హర్షగూడ గ్రామానికి చెందిన రమావత్ లక్ష్మణ్నాయక్ అనే టీఆర్ఎస్ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని భార్య రమావత్ పద్మావతికి 5లక్షల రైతు బీమా, పార్టీ సభ్యత్వ బీమా 2 లక్షల చెక్కు, హర్షగూడ గ్రామానికి చెందిన చెన్నయ్యకు 33, 500ల రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఈశ్వర్నాయక్, మాజీ సర్పంచ్ జానారెడ్డి, ఉపసర్పంచ్లు రవినాయక్, రాజునాయక్, తుక్కుగూడ కౌన్సిలర్ రవినాయక్, నాయకులు సీతారాం నాయక్, రాజుకుమార్ నాయక్, వార్డు సభ్యులు జర్పుల రాజు, ఇస్లావత్ రవి, పెండ్యాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట, ఆగస్టు 5 : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యుల పదవి కాలం సంవత్సరం పూర్తి కావడంతో గురువారం మంత్రి సబితారెడ్డిని, బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాతను మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో కో ఆష్షన్ సభ్యులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జ్యోతి అశోక్, గుర్రం ప్రసన్న వెంకట్రెడ్డి, రఘునందన చారి, ఖలీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.