బడంగ్పేట,ఆగస్టు 3 : ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలకు పెదపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ 24, 25 డివిజన్లలో రూ.2.87 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అవుట్లెట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ అభివృద్ధి పనులను ఆపలేదని వెల్లడించారు. కాలనీలలో మౌలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, డ్రైనేజీ వ్యవస్థను మెరు గు పర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
అల్మాస్గూడ ప్రధాన రహదారి, హైమాత దేవాలయం రోడ్డును రూ.1.50కోట్లతో విస్తరణ చేయిస్తున్నామని వివరించారు. అల్మాస్గూడ రోడ్డు పనులు ప్రారంభం కాగా హైమాత దేవాలయం రోడ్డు టెండర్ ప్రక్రియలో ఉందన్నారు. రాజీవ్ గృహకల్పలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. చెరువులను సుందరీకరణ చేస్తున్నామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కమిషనర్ కృష్ణమోహన్రెడ్డి, డీఈఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు ఏనుగు రాంరెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, స్వప్నావెంకట్రెడ్డి, టీఆర్ఎస్ బడంగ్పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, బోయపల్లి శేఖర్రెడ్డి, కుంచ నాగేందర్, చప్పిడి సంతోష్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట/ఆర్కేపురం ఆగస్టు 3 : బోనా ల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో దేవాలయాలకు సంబంధించిన చెక్కులను మంత్రి మంగళవారం అందజేశారు. రంగారెడ్డి జిల్లాలో 349 దేవాలయాలకు రూ.1.90కోట్లు కేటాయించారని మహేశ్వరం నియోజకవర్గానికి రూ.11లక్షలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. మహేశ్వరం, రాజేందర్నగర్, శేర్ లింగం పల్లి, ఎల్బీనగర్లో ఉన్న దేవాలయలకు నిధులు కేటాయించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, కార్పొరేటర్స్ బండారు మనోహర్, వంగేటి ప్రభాకర్రెడ్డి, కార్పొరేటర్లు అధికారులు తదితరులు ఉన్నారు.