కందుకూరు, ఆగస్టు 2 : ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని బేగంపేట్లో రూ. 22లక్షలు, గుమ్మడవెల్లి గ్రామంలో రూ. 22లక్షలతో నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, రంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. గుమ్మడవెల్లి తండాలో రూ.12లక్షలతో నిర్మించిన అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని పథకాలను ప్రవేశపెడుతూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించి ప్రతి ఎకరాకు సాగు నీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. మహేశ్వరం మండలంలో 8251, కందుకూరు మండలంలో 10,914ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.
విత్తనాలు, ఎరువులు, 24గంటల ఉచిత వి ద్యుత్ను అందిస్తు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో 6లక్షల మందికి 50వేల రుణ మాఫీ వర్తిస్తుందని చెప్పారు. రైతులకు రైతుబంధు, రైతు బీమాను అందిస్తున్నట్లు తెలిపారు. వరి సాగులో పంజాబ్ రాష్ర్టాన్ని మించి ముందంజలో ఉన్నామని తెలిపారు. సర్పంచ్లు గోవర్ధన్, ప్రభాకర్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైతు సమితి మండల అధ్యక్షుడు కృష్ణరాంభూపాల్రెడ్డి.మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైఎస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, వైఎస్ ఎంపీపీ శమంతాప్రభాకర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు పరంజ్యోతి, కాకి ఇందిరమ్మ దశరథ, శ్రీలతాశ్రీహరి, రాము, రామకృష్ణారెడ్డి, భూపాల్రెడ్డి, కళమ్మ రాజు, జ్యోతి, నరేందర్గౌడ్, గోపాల్రెడ్డి, శ్రీనివాస్, గీతేశ్వరీ గణేశ్, ఏనుగు శ్రావణి జంగారెడ్డి, సాయిలు, ఎంపీటీసీలు బాల్రాజ్, ఎల్లారెడ్డి, రాములు, సురేశ్, ఇందిరమ్మ దేవేందర్, నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు చిర్ర సాయిలు, ఈశ్వర్గౌడ్, డైరెక్టర్లు పారిజాతం, ఆనంద్, శేఖర్రెడ్డి, పర్వతాలు, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు జయేందర్, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో కృష్ణకుమార్, ఏడీఎ సుజాత, పీఆర్ ఏఈ విష్ణువర్ధన్రెడ్డి, జగన్మోహన్రెడ్డి తది తరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేవిధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రశంసించారు. రైతులు మూస పద్ధతుల్లో వ్యవసాయం చేయవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామం బాగుపడాలంటే రైతులు బాగుండాలని కోరారు. వ్యవసాయ విధానంలో మార్పులు చేసుకొని దిగుబడి వచ్చే పంటలను సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని కోరారు.