ఆర్కేపురం, జూలై 30 : కొవిడ్ సమయంలో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్నగర్ డివిజన్ వెంకటేశ్వర కాలనీలోని కమ్యూనిటీ హాల్లో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్ చైర్లను, టాబ్లను కార్పొరేటర్ ఆకుల శ్రీవాణితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కమిట్మెంట్స్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు రూ.3వేల పెన్షన్ ఇస్తూ గొప్ప మనసు చాటుకున్నార న్నారు. ప్రభుత్వం తరుపున ద్విచక్ర వాహనాలు, పరికరాలు అందిస్తామని చెప్పారు. చిన్నారులకు డిక్షనరీలు పంపిణీ చేశారు.