ఆర్కేపురం, జూలై 30 : రాష్ట్రంలో పేదల ఆకలిని తీర్చేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి యేటా రూ.2766 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్కేపురం డివిజన్ వాసవీ కాలనీలోని ఆధ్యాత్మిక కేంద్రంలో సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లకు నూతనంగా మంజూరైన 1400 రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతనంగా 3లక్షల 9వేల రేషన్ కార్డులు మంజూరు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి నెలా రేషన్ సరుకుల పంపిణీ కోసం రూ.231 కోట్లను వెచ్చిస్తుందని వెల్లడించారు. నూతన కార్డు దారులకు ఆగస్టు నెల నుంచి రేషన్ అందుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 87.41 లక్షల కార్డులు ఉండగా కొత్త కార్డులతో కలిపి 90.50లక్షలకు చేరిందని దీని ద్వారా 2కోట్ల 88 లక్షల మందికి నెలకు ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
రేషన్ డీలర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీని వేసి సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్, కందుకూర్ ఆర్డీవో వెంకటచారి, డీఎస్ఓ రాథోడ్, ఏఎస్ఓ సరోజ, సరూర్నగర్ తహసీల్దార్ రామ్మోహన్, టీఆర్ఎస్ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ, ప్రధాన కార్యదర్శి పెండ్యాల నగేశ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, సరూర్నగర్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, నాయకులు న్యాలకొండ శ్రీనివాస్రెడ్డి, మారోజు రామాచారి, పారుపల్లి దయాకర్రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, పెంబర్తి శ్రీనివాస్, సాజిద్, జిల్లెల కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట, జూలై 30 : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ మారుతినగర్ కాలనీలో కార్పొరేటర్ సూర్ణ గంటి అర్జున్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. పురాతన దేవాలయాలను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని అన్నారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం , బోనాలను చేసుకోవాలని సూచించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూ టీ మేయర్ ఇబ్రాం శేఖర్, బడంగ్పేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు ఏనుగు రాంరెడ్డి,, పెద్ద బావి శ్రీనివాస్రెడ్డి, పెద్దబావి సుదర్శన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పెద్ద బావి ఆనంద్రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, రాళ్ల గూడెం శ్రీనివాస్రెడ్డి, సంరెడ్డి వెంకట్రెడ్డి, ముత్యాల కృష్ణ, శ్రీనివాస రాజ్, పుట్టగల్ల సంతోష్, బొట్టు వెంకటేశ్, సాయిబాబా గౌడ్, కర్ణ కోట నరేశ్, హర్షవర్ధన్రెడ్డి, కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు. జూలై 30 : మండలంలో దశల వారీగా అర్హులందరికీ రేషన్ కార్డులు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. మండలానికి మంజూరైన నూతన రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సురేందర్రెడ్డి, శేఖర్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.