కందుకూరు/మహేశ్వరం,జూలై 29 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని 35గ్రామ పంచాయతీలు, అనుబంధ గ్రామాలకు మంజూరైన 1042 నూతన రేషన్ కార్డులను గురువారం ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని వివరించారు. రేషన్ కార్డులు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని తెలిపారు. ప్రభుత్వం ప్రతి నెలా రూ. 231కోట్లు, సంవత్సరానికి 2766కోట్ల రూపాయలతో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుందని, కరోనా సమయంలోనూ రేషన్కార్డు లబ్ధిదారులకు ఉచిత బియ్యం, నగదును అందజేసినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికీ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, వైస్ ఎంపీపీ శమంతాప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని వరలక్ష్మీసురేందర్రెడ్డి, ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ ఎస్ జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, సర్పంచులు సాధ మల్లారెడ్డి, సురుసాని శమంతకమణి, రామకృష్ణారెడ్డి, సదాలక్ష్మీ పుల్లారెడ్డి, బాలమణి, పరంజ్యోతి, కళమ్మ రాజు, జ్యోతి, శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జయేందర్, ఉపాధ్యక్షులు మహేందర్రెడ్డి, దామోదర్గౌడ్, శేఖర్రెడ్డి, రాము, ఎంపీటీసీలు ఇందిరమ్మ, రాము లు, సాయిలు, ఎస్సీ విభాగం అధ్యక్షుడు చిర్ర సాయిలు, డైరెక్టర్ పొట్టి ఆనంద్, పరంజ్యోతి, శేఖర్రెడ్డి, పారిజాతం, మండల యూత్ నాయకులు తాళ్ల కార్తిక్, బొక్క దీక్షిత్రెడ్డి, ప్రశాంత్చారి, బర్కం వెంకటేశ్, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు..
నూతనంగా మంజూరైన రేషన్కార్డులను మహేశ్వరం మండల కేంద్రంలోని ఫంక్షన్హాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేషన్కార్డులను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ ఆహార భద్రత కార్డులు పేదలకు వరమని అన్నారు. తెలంగాణలో 3లక్షల 9వేల మందికి నూతనంగా రేషన్కార్డుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో 7వేలకు పైచిలుకు రేషన్కార్డులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. కొత్తగా ఇస్తున్న 3లక్షల 9వేల రేషన్ కార్డులతో మొత్తం రాష్ట్రంలో రేషన్కార్డు దారుల సంఖ్య 90లక్షలకు చేరుతుందని ఆమె అన్నారు. వీటి ద్వారా 2కోట్ల 80లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు.ప్రభుత్వం ఏటా 2వేల 7 వందల కోట్ల ఆహార భద్రత కోసం ఖర్చుచేస్తుందని ఆమె అన్నారు. కార్యక్రమంలో జడ్పీచైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, ఎంపీపీ రఘుమారెడి ్డ,వైస్ఎంపీపీ సునీతాఆంధ్యానాయక్, సహకారబ్యాంక్ చైర్మన్ మంచెపాండుయాదవ్, సర్పంచ్లు సురేఖ కరుణాకర్రెడ్డి, వీరానాయక్, అరుణారమేశ్, సంధ్యారాజేశ్, పద్మపాండు,యాదయ్య, చంద్రశేఖర్రెడ్డి కోఆప్షన్సభ్యులు ఆదిల్అలీ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కందుకూరు, జూలై 29 : అభివృద్ధిని అడ్డుకోవద్దని, ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని బీజేపీ నాయకులు చూడడం సరికాదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. మంత్రులను అడ్డుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని వారి ఆటలను టీఆర్ఎస్ ప్రభుత్వం సాగనివ్వదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులకు మింగుడు పడక అర్ధంలేని మాటలను మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుంటే వారికి కనపడడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏ మేరకు అభివృద్ధి జరుగుతుందని ప్రశ్నించారు. కేంద్ర, మంత్రులు రాష్ట్ర పథకాలను ప్రశంసిస్తుంటే ఇక్కడ నాయకులు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు.