బడంగ్పేట, జూలై 23: పట్టణాల అభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రణాళికాబద్ధంగా, ప్రత్యేకకార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడ 10వ డివిజన్లో రూ.20 లక్షలు, గుర్రం గూడ 7వ డివిజన్లో రూ.20లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పనులకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. అల్మాస్గూడలో ఉన్న పోచమ్మ కుంట, కోమటి కుంటలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. రింగ్ రోడ్డు లోపల ఉన్న శివారు నియోజక వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1200 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు.
శివారులో మంచి నీటి సమస్యను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. మహిళలు ముందుకు వచ్చి ప్రతి ఇంట్లో ఆరు మొక్కలు నాటాలన్నారు. పచ్చదనం ఉట్టి పడే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలతో గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పెరిగిందని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెలా మున్సిపల్ కార్పొరేషన్లకు నిధులు నేరుగా వస్తాయన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణామోహన్రెడ్డి, డీఈ అశోక్, కార్పొరేటర్ రోహిణి రమేశ్, గడ్డం లక్ష్మారెడ్డి, శంకర్, సూర్ణ గంటి అర్జున్, పి శ్రీనివాస్రెడ్డి, పెద్ద బావి సుదర్శన్రెడ్డి, టీఆర్ఎస్ బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గుర్రం సాయి కిరణ్ రెడ్డి, విష్ణు వర్ధన్రెడ్డి, బీమిడి జంగారెడ్డి, రాళ్ల గూడెం శ్రీనివాస్రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేటలో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు సమైఖ్య జ్యోతి అశోక్ సెకండ్ హోమ్ కిచన్ రెస్టారెంట్ను శుక్రవారం ప్రారంభించారు. నగరానికే పరిమితమైన హోటళ్లను గ్రామీణుల చెంతకు తీసుకురావడం పట్ల నిర్వాహకులను అభినందించారు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా రుచికరమైన, నాణ్యతగా ఉండేలా సేవలందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సెకండ్ హోమ్ నిర్వాహకులు కోఆప్షన్ సభ్యురాలు సమైఖ్య జ్యోతి అశోక్, వీరయ్య, శ్రీనివాస్, కృష్ణ, వెంకటేశ్ , కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్, ఏనుగు రాంరెడ్డి, సంరెడ్డి వెంకట్రెడ్డి, బోయపల్లి శేఖర్రెడ్డి, పెద్ద బావి ఆనంద్రెడ్డి, ముత్యాల కృష్ణ, మహేశ్,సహన్, జీవన్, దేవేందర్, తేజీ, ఛాంద్ పాషా తదితరులు ఉన్నారు.